భారతదేశం, మార్చి 13 -- తమిళ స్టార్ హీరో విజయ్‌తో కలిసి పెళ్లి వేడుకకు హాజరైన తర్వాత త్రిష తొలిసారిగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. ఈ క్రమంలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు ఆమె ఎక్కడా అసహనం వ్యక్తం చేయకుండా, మౌనంగానే సమాధానం ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవలే చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకకు వీరిద్దరూ కలిసి హాజరు కావడంతో నెట్టింట రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఈ పరిణామాల తర్వాత త్రిష తొలిసారిగా చెన్నై విమానాశ్రయంలో మీడియా కంట పడింది.

వైట్ టీ-షర్ట్, బ్లాక్ ప్యాంట్స్, డెనిమ్ జాకెట్ ధరించి స్టైలిష్‌గా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న త్రిషను చూడగానే రిపోర్టర్లు చుట్టుముట్టారు. ముఖ్యంగా హీరో విజయ్‌తో కలిసి పెళ్లికి వెళ్లడంపై తలెత్...