Tokyo earthquake today : జపాన్లో మరోసారి భూకంపం- వణికిపోయిన టోక్యో!
భారతదేశం, ఆగస్టు 23 -- జపాన్ను భూకంపం మరోసారి భయపెట్టింది. ఆదివారం తెల్లవారుజామున తూర్పు జపాన్లో సంభవించిన భూకంపం కారణంగా రాజధాని టోక్యో ప్రాంతం ఒక్కసారిగా వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.9గా నమోదైందని అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంతో ఎలాంటి సునామీ ముప్పు లేదని స్పష్టం చేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
జపాన్ వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. తరచూ భూకంపాలు సంభవించే ఇబరాకి ప్రిఫెక్చర్ దక్షిణ ప్రాంత భూగర్భంలో 70 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం కేంద్రీకృతమైంది.
అయితే యూఎస్ జియోలాజికల్ సర్వే మాత్రం దీని తీవ్రతను 5.8గా రికార్డ్ చేసింది.
ఈ జపాన్ భూకంపం కారణంగా నాలుగు ప్రిఫెక్చర్లలో మొత్తం 23 మంది గాయపడ్డారు. సైతామాలో తొమ్మిది మంది, కనగావాలో తొమ్మిది మంది, చిబాలో నలుగురు, ఇబరాకిలో ఒకరు గాయపడినట్లు ఆయా ప్రాంతాల అధికారులు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.