భారతదేశం, జూన్ 13 -- Tirumala Tirupati updates : కలియుగ వైకుంఠం తిరుమల గిరులు భక్తుల జనసందోహంతో కిటకిటలాడుతున్నాయి. వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతో దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో సప్తగిరులు పూర్తిగా నిండిపోయాయి. తిరుమలలో ఎటు చూసినా భక్తుల రద్దీ కనిపిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని గదులు, నారాయణగిరి ఉద్యానవనంలోని తాత్కాలిక షెడ్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. ప్రస్తుతం క్యూలైన్లు గోగర్భం డ్యాం సర్కిల్ సమీపంలోని ఆక్టోపస్ భవనం వెలుపల వరకు విస్తరించాయి.

టోకెన్లు లేని భక్తులకు ఉచిత సర్వదర్శనం (సర్వదర్శన భక్తులు) కోసం దాదాపు 24 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. రద్దీని క్రమబద్ధీకరించడానికి అధికారులు ప్రస్తుతం భక్తులను బాట గంగమ్మ ఆలయం గుండా సర్వదర్శన క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు.

గంటల తరబడి లైన్లలో వేచి ఉన్న భక్త...