భారతదేశం, జూన్ 10 -- Tirumala Srivani Ticket Changes : కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతంగా సేవలందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా 'శ్రీవాణి' (SRIVANI) ట్రస్టుకు సంబంధించిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కేటాయింపు నిబంధనలలో టీటీడీ పాలకమండలి కొన్ని కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు, స్వామివారికి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చే దాతలకు ప్రాధాన్యత కల్పించేలా ఈ సరికొత్త విధానాన్ని రూపొందించింది.

ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. టీటీడీ రోజుకు మొత్తం 1,500 శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్‌లైన్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచుతోంది. వీటిలో 500 దర్శన టికెట్లను మూడు నెలల ముందే అడ్వాన్స్ బు...