భారతదేశం, సెప్టెంబర్ 15 -- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అయితే 15వ సారి పట్టువస్త్రాలు సమర్పించి.. అరుదైన రికార్డు నమోదు చేశారు.

శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద అర్చకులు ముఖ్యమంత్రికి సంప్రదాయబద్ధంగా 'పరివట్టం' కట్టారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలను వెండి పళ్ళెంలో తలపై మోస్తూ మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లి గర్భాలయంలో అర్చకులకు అందజేశారు.

స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు సీఎం దంపతులకు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర ముఖ్యమంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు. టీటీడీ రూపొందిం...