భారతదేశం, ఆగస్టు 19 -- శ్రీవారి అన్న ప్రసాద విత‌ర‌ణ‌లో కూరగాయల దాతల సేవలు అత్యంత కీలకమైన‌వ‌ని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని ప‌ద్మావ‌తి అతిథిగృహంలో సుధ‌ర్మ స‌మావేశ మందిరంలో మంగ‌ళ‌వారం అన్న ప్రసాదాల త‌యారీకి కూరగాయలు విరాళంగా అందిస్తున్నదాతలతో ఆయ‌న స‌మావేశం నిర్వహించారు. అన్న ప్రసాద‌ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కూరగాయల సరఫరా, రవాణా, నిల్వ, వినియోగం, నాణ్యత, భవిష్యత్ అవసరాలు తదితర అంశాలపై దాతలతో చర్చించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గత నాలుగైదు నెలలుగా తిరుమలలో రోజుకు సుమారు 4 లక్షల మందికి అన్నప్రసాదం అందిస్తున్నామని, ఇందుకోసం రోజుకు సుమారు 13-14 టన్నుల బియ్యం, 8 టన్నులకు పైగా కూరగాయలు వినియోగిస్తున్నామని చెప్పారు. ఇంత భారీ స్థాయిలో కూరగాయలను నిరంతరం దాతల ద్వారా సమకూర్చడం విశేషమన్నారు.

గత 25-30 ...