భారతదేశం, మే 23 -- తిరుమల వెళ్లాలనుకుంటున్నారా? ఆగస్టులో స్వామివారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అయితే భక్తుల కోసం టీటీడీ ఆన్లైన్ కోటాను రిలీజ్ చేయబోతోంది. దర్శన టికెట్లతో పాటు వసతి గదుల బుకింగ్, ప్రత్యేక సేవల వివరాలను అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.

మే 23 అనగా ఈరోజు ఆగస్టు కోటాకు సంబంధించి కొన్ని సేవలను టీటీడీ అందుబాటులోకి తీసుకు వస్తుంది. టీటీడీ అధికారిక వెబ్సైట్ (https://ttdevasthanams.ap.gov.in/home/dashboard) ద్వారా అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

ఈరోజు అంగప్రదక్షిణ టోకెన్ల విడుదల సమయం: ఉదయం 10 గంటలకు.

ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటా విడుదల సమయం: ఉదయం 11 గంటలకు.

వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న భక్తులకు ఉచి...