భారతదేశం, మార్చి 9 -- చాలా మంది ఇండియన్స్‌కు ఇప్పుడు రీల్స్ పిచ్చి పట్టుకుంది. ఎక్కడకు వెళ్లినా అదే పనిలో ఉంటున్నారు. పక్కన ఉన్నది ఏంటి, వీడియోలు చేయెుచ్చా? లేదా అనేది కూడా ఆలోచించడం లేదు. వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో పెట్టేయడం.. తర్వాత కాంట్రవర్సీ క్రియేట్ అవ్వడం. కొందరైతే ప్రాణాల మీదకు తెచ్చుకునేలా కూడా రీల్స్ చేస్తున్నారు. ఇక తాజాగా అమెరికాలో ఓ మహిళతో కలిసి ఒక కొరియోగ్రాఫర్ టిక్‌టాక్ వీడియో తీశాడు. వీడియో తీసిన ప్రదేశంపై అమెరికన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

తెలుగు పాటలతో గుర్తింపు పొందిన టిక్‌టాకర్, కొరియోగ్రాఫర్ మధు రాజు ఓ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియోతో అమెరికాలో ఉంచుతారా? పంపించేస్తారా? అనేదాకా వచ్చింది. వివాదాస్పద డ్యాన్స్ వీడియో తర్వాత బహిష్కరణ భయాలు పెరగడంతో అతడి కెరీర్‌ మీద ప్రభావం పడేలా ఉంది....