భారతదేశం, ఫిబ్రవరి 26 -- వివాదాస్పద మూవీ 'ది కేరళ స్టోరీ 2-గోస్ బియాండ్' సినిమాకు కేరళ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా విడుదలను నిలిపివేస్తూ న్యాయస్థానం గురువారం (ఫిబ్రవరి 26) నాడు మధ్యంతర స్టే విధించింది. సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చే సమయంలో సెన్సార్ బోర్డు కనీస ఆలోచన చేయలేదని న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 27న ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా.. కోర్టు తాజా ఉత్తర్వులతో దానికి బ్రేక్ పడింది.

'ది కేరళ స్టోరీ 2-గోస్ బియాండ్' సినిమా విడుదలను అడ్డుకుంటూ కేరళ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం (ఫిబ్రవరి 26) నాడు జరిగిన విచారణలో ఈ సినిమా ప్రదర్శనపై మధ్యంతర స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమా విడుదలను సవాలు చేస్తూ దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ బెచు కురియన్ థామస్ విచారించారు.

విచార...