భారతదేశం, ఏప్రిల్ 20 -- Tharun Bhascker: టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన దర్శకులలో తరుణ్ భాస్కర్ ఒకరు. 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' వంటి చిత్రాలతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారాయన. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన 'గాయపడ్డ సింహం' మే 1వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా తరుణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ కాలంలో ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు హిట్ అయిన మాస్ మసాలా ఫార్ములాలు ఇప్పుడు వర్కవుట్ కావడం లేదు. ఇదే విషయాన్ని తరుణ్ భాస్కర్ ప్రస్తావిస్తూ.. రొటీన్ సినిమాలపై తనకున్న అయిష్టాన్ని బయటపెట్టారు.

"ఒక ఇంట్రడక్షన్ సాంగ్, నాలుగు పాటలు, ఐదు ఫైట్లు ఉండే రెగ్యులర్ ఫార్ములా సినిమా గనుక నేను తీస్తే.. అది నా కెరీర్‌కే ఆఖరి ప్రాజెక్ట్ అవుతుంది. నేన...