భారతదేశం, ఆగస్టు 10 -- Thanuja: బుల్లితెరపై వినోదాన్ని, రుచులను కలబోసి ప్రేక్షకులను అలరించిన ప్రముఖ రియాలిటీ షో 'కుక్కు విత్ జాతిరత్నాలు' (Cooku with Jathirathnalu) సీజన్ 2 ముగిసింది. బిగ్ బాస్ 9 తెలుగులో రన్నరప్ గా నిలిచిన తనూజ పుట్టస్వామి.. ఈ వంటల షోలో టైటిల్ ఎగరేసుకుపోయింది.

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో తనూజ పుట్టస్వామి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ రియాలిటీ షోలో లాస్ట్ వరకూ వచ్చిన తనూజ చివరి మెట్టుపై ఆగిపోయింది. కానీ ఈ సారి కుక్కు విత్ జాతిరత్నాలు షోలో మాత్రం పట్టు వదల్లేదు. విన్నర్ గా ట్రోఫీ అందుకుంది. ఆదివారం (ఆగస్టు 9) రాత్రి జరిగిన ఫినాలేలో తనూజ విన్నర్ గా నిలిచింది.

కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 2 షోలో విన్నింగ్ టైటిల్ తో పాటు భారీ ప్రైజ్ మనీని కూడా తనూజ సొంతం చేసుకుంది. ట్రోఫీ గెలిచిన ఆమెకు ఏకంగా రూ.10 లక్షల నగదు బహుమతి...