భారతదేశం, జూన్ 24 -- టీజీఎస్ఆర్టీసీ తన ఆదాయ వనరులను పెంచుకోవడంతో పాటు, స్థానిక వ్యాపారవేత్తలు, యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ బస్టాండ్లు, డిపోల పరిధిలోని 694 ఖాళీ వాణిజ్య దుకాణాలు, స్థలాలను లీజుకు ఇచ్చేందుకు త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

తెలంగాణలోని ప్రధాన నగరాలు, పట్టణాలు, డిపోల ప్రాంగణాల్లో అందుబాటులో ఉన్న అన్ని వాణజ్య స్థలాల పూర్తి వివరాలను సంస్థ ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్ అయిన tgsrtc.telangana.gov.inలో అందుబాటులో ఉంచింది.

గతంలో బస్టాండ్లలోని దుకాణాల కేటాయింపుల్లో దళారీల హస్తం ఉందనే ఆరోపణలు వచ్చేవి. వీటికి అడ్డుకట్ట వేస్తూ, పారదర్శకతను పెంచేందుకు టీజీఎస్‌ఆర్‌టీసీ యాజమాన్యం సరికొత్త ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఏయే దుకాణాలు ఖాళీగా ఉన...