భారతదేశం, మార్చి 3 -- తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ఓటీఆర్ అప్డేట్ అవకాశాన్ని పొడిగించిన విషయం తెలిసిందే. నిజానికి ఫిబ్రవరి 25వ తేదీన ముగియాల్సి ఉంది. కానీ అభ్యర్థుల సౌలభ్యం కోసం మార్చి 25వ తేదీ వరకు పొడిగించింది. అయితే ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేసింది. తాజాగా అభ్యర్థులకు ఈ విషయాన్ని గుర్తుచేస్తూ సర్వీస్ మెసేజ్‌లను పంపిస్తోంది టీజీపీఎస్సీ.

'అందరు అభ్యర్థులు జనవరి 17 నాటి వెబ్‌నోట్ ప్రకారం నిర్దేశించిన గడువు(25/03/2026)లోగా ఓటీఆర్ వివరాలను సరిచూసుకొని సరైన వివరాలను మాత్రమే నమోదు చేసుకోగలరు. సంబంధిత ధ్రువ పత్రాలను అప్‌లోడ్ చేయగలరు. తదుపరి ఎలాంటి అవకాశం ఉండదు. రానున్న రిక్రూట్‌మెంట్‌లలో ఇట్టి డేటాను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.' అని టీజీపీఎస్సీ తాజాగా అభ్యర్థులకు సర్వీస్ మెసేజ్‌లు పంపింది.

తప్పనిసరిగా కొత్త కల...