భారతదేశం, జూలై 13 -- తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) జూన్ సెషన్ ఫలితాలు వచ్చేశాయ్. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ మార్కులు, స్కోర్ కార్డ్‌ను వెబ్‌సైట్ ద్వారా వేగంగా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది టెట్ పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 43.94 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. జూన్ 16 నుంచి జూన్ 22 వరకు మొత్తం పది సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్షగా (CBT) ఈ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించింది.

ఈ ఏడాది జూన్ సెషన్ టెట్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,15,028 మంది (74.81 శాతం) పరీక్షకు హాజరయ్యారు. కాగా, ఈ పరీక్ష రాసిన వారిలో 23,623 మంది ఇన్-సర్వీస్ (ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న) ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే.. సాధారణ అభ్యర్థులతో ...