భారతదేశం, ఏప్రిల్ 28 -- తెలంగాణలోని పదో తరగతి విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వీరి నిరీక్షణకు తెరపడే సమయం దగ్గరపడింది. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టెన్త్ ఫలితాలను ఈ నెల 29న లేదా 30వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.

మొదట మే మొదటి వారంలో ఫలితాలు వస్తాయని భావించినప్పటికీ. ఈ నెలాఖారు నాటికే ఫలితాలను ప్రకటించనున్నారు. స్పాట్ వాల్యూయేషన్ తో పాటు ఇతర ప్రక్రియలు వేగంగా పూర్తి కావటంతో ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించారు.

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమైన పదో తరగతి ప్రధాన పరీక్షలు ఏప్రిల్ 13వ తేదీతో ముగిశాయి. సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన వెంటనే విద్యాశాఖ యుద్ధ ప్రాతిపదికన జవాబు పత్రాల మూల్యాంకనా...