భారతదేశం, మార్చి 12 -- రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈనెల 14వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 16వ తేదీతో అన్ని సబ్జెక్టులు పూర్తవుతాయి. అయితే గతేడాది మాదిరిగానే ఈసారి పరీక్షల్లో కూడా ఓఎంఆర్ షీట్ విధానం ఉండనుంది. ఈసారి కూడా ఆన్సర్ షీట్ కు ఓఎంఆర్ షీట్ ఉండనుంది. విద్యార్థులు.. ఆన్సర్ బుక్‌లెట్‌కు జతచేయబడిన OMR షీట్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.

ఈ ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది.? దీన్ని పూర్తి చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై అధికారులు ఓ వీడియోను రూపొందించారు. ఈ వీడియోను https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు. ఇంగ్లీష్ తో పాటు తెలుగు మీడియం విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వేర్వురు వీడియోలను అందుబాటులో ఉంచారు.

Published by HT Digital Content Services with permission from H...