భారతదేశం, మార్చి 13 -- రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. రేపట్నంచే పరీక్షలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 16వ తేదీతో అన్ని సబ్జెక్టులు పూర్తవుతాయి. పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు అధికారులు పలు కీలక సూచనలు చేశారు.

పరీక్షల వేళ అధికారులు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాలకు 30 నిమిషాల ముందే చేరుకోవాలని చెబుతున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సకాలంలో రాకుండా చివరి నిమిషంలో వస్తే.. విద్యార్థులు చాలా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

పరీక్షా కేంద్రాన్ని కూడా ముందుగానే చూసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లోని సెంటర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని అల...