భారతదేశం, ఆగస్టు 17 -- తెలంగాణ ప్రజల ఆరోగ్యం, భద్రత, సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతనిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎస్సెన్షియల్ డ్రగ్స్(TG-SAFE) వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సోమవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు.

'ఆహారం, ఔషధాల నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణకు ఒకే విభాగంగా రూపుదిద్దుకున్న టీజీ-సేఫ్ నేటి నుంచి అమల్లోకి వస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. సురక్షితమైన తెలంగాణ రూపకల్పనలో పౌరులందరూ ఈ సేవలను వినియోగించుకోవాలి.' అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రజారోగ్యం, వినియోగదారుల రక్షణ, నాణ్యతా ప్రమాణాల పరిశీలన, చట్టబద్ధమైన నిబంధనల అమలులో ఆహార భద్రతా విభాగం (Food Safety Dept), డ్రగ్స్ కంట్రోల్ విభాగం...