భారతదేశం, మార్చి 23 -- రైతు భరోసా స్కీమ్ నిధులు విడుదలైన సంగతి తెలిసిందే. ఇవాళ్టి నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమవుతాయి. వచ్చే 45 రోజుల్లోగా రైతులందరి ఖాతాల్లోకి నిధులు చేరిపోతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాష్ట్రంలో మెుత్తం 73 లక్షల మంది అన్నదాతలు ఉన్నారు. ఒక ఎకరం వరకు సాయం అందించేలా రూ.3590 కోట్లను విడుదల చేశారు. ఆదివారం సెలవు కారణంగా సోమవారం(ఇవాళ) రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయి. 20 రోజుల తర్వాత రెండో విడతలో రూ.2650 కోట్లు, మూడో విడుతలో రూ.2760 కోట్లను విడుదల చేస్తారు. మొత్తం 3 విడతల ద్వారా. రూ. 9 వేల కోట్లను జమ చేస్తారు.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు రైతు భరోసా పథకంలో లబ్ధిపొందని వారికి ప్రభుత్వం మరో ఛాన్స్ ఇచ్చింది. ఈ స్కీమ్ కింద లబ్ధి పొందేందుకు కొత్త దరఖాస్తులను స్వీకరించేందుకు మరో అవకాశం కల్పించింది. అర్హులైన రైతులు. మార్చి 25వ తేదీ వరక...