భారతదేశం, జూన్ 27 -- Telangana Rythu Bharosa Applications : తెలంగాణలోని కొత్త పట్టాదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ నెల 15వ తేదీ వరకు కొత్తగా వ్యవసాయ భూములను కొనుగోలు చేసి, పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులందరూ రైతు భరోసా పథకానికి అర్హులని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్తగా పాస్‌పుస్తకాలు అందుకున్న రైతులు వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది.

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30వ తేదీన రైతు భరోసా వానాకాలం సీజన్‌ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో, ఇప్పటికే పథకంలో నమోదైన పాత రైతులతో పాటు కొత్తగా భూములు కొన్నవారికి కూడా ఈ విడతలోనే సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా పేర్లు నమోదు చేసుకున్న కొత్త పట్టాదారులందరికీ ఈ వానాకాలం సా...