భారతదేశం, సెప్టెంబర్ 16 -- Telangana Rajiv Yuva Vikasam Scheme : నిరుద్యోగ యువతకు సొంతంగా ఉపాధి మార్గాలు చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. 'రాజీవ్‌ యువ వికాసం' పథకం కింద తొలి విడతగా అర్హులైన లబ్ధిదారులకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు కోసం రూ.లక్ష వరకు ఆర్థిక సహాయం అందించేలా వేగంగా చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

నవంబరు 19వ తేదీ నుంచి ఈ ఆర్థిక సాయాన్ని లబ్ధిదారుల చేతికి అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పనితీరు, సంక్షేమ పథకాల అమలుపై డిప్యూటీ మంగళవారం ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ భేటీలో సంక్షేమ పథకాల అమల్లో వేగం పెంచడం. గురుకుల వి...