భారతదేశం, ఆగస్టు 11 -- Telangana Cheyutha Pension Application Form : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో చేపట్టిన 'చేయూత' పింఛన్ల ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. అర్హులైన పేదలకు సకాలంలో పింఛన్లు అందించేందుకు వీలుగా అధికారులు కసరత్తును వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే కొత్తగా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు.

అర్హులైన లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, దరఖాస్తు ప్రక్రియ సులభంగా పూర్తి చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. చేయూత అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారమ్‌లను అందుబాటులో ఉంచారు. ప్రజలు నేరుగా ఇంటర్నెట్ ద్వారా వీటిని సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అభ్యర్థులు తమ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు,...