భారతదేశం, జూన్ 4 -- రెవెన్యూ వ్యవస్థలో ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఓవైపు భూ భారతి సేవలు అందుబాటులోకి రాగా. తాజాగా భూముల ధరలను కూడా క్రమబద్ధీకరించనుంది. ఈనెల 5వ తేదీ నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని కూడా సర్కార్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు.

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచే ఆలోచన ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని మంత్రి పొంగులేటి తేల్చిచెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలను 6 శాతం నుండి ఏకంగా 7.5 శాతానికి పెంచిందని ఆయన గుర్తుచేశారు. కేవలం ఒక శాతం చార్జీలు పెంచినా కూడా ప్రజలపై వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందన్న ప్రజాకోణంలోనే తమ ప్రభుత్వం ఆలోచించిందని తెలిపారు. అందుకే వాస్తవ పరిస్థితులకు దగ్గరగా, శాస్త్రీయ పద్ధతి...