భారతదేశం, ఏప్రిల్ 9 -- ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విడుదలపై తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఫలితాల విడుదలను ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తున్న వార్తలను ఖండించింది. అవన్నీ తప్పుడు వార్తలని. అందులో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది.

ఇంటర్ ఫలితాల ప్రకటన నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని తెలంగాణ విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా ఏప్రిల్ మొదటి వారంలో ఫలితాలు విడుదల కాలేదని పేర్కొంది.

ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం, ఇతర అంశాలను బట్టి ఫలితాల విడుదల అయ్యే తేదీలు ప్రతి ఏటా మారుతుంటాయని తెలంగాణ విద్యాశాఖ వివరించింది. అదే మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కొనసాగుతుందని స్పష్టం చేసింది. మూల్యాంకన సమయాన్ని బట్టి. ఫలితాల విడుదల తేదీపై ప్రకటన చేస్తారని పేర్కొంది.

ఇంటర్మీడియట్ ఫలితా...