భారతదేశం, ఆగస్టు 22 -- TG ICET 2026 Seat Allotment :ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఐసెట్ 2026 చివరి విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ తుది విడత కౌన్సెలింగ్‌లో కొత్తగా 11,729 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద మొత్తం 38,462 ఎంబీఏ, ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యేసరికి మొత్తం 23,988 సీట్లు (62 శాతం) భర్తీ అయినట్లు అధికారులు వెల్లడించారు.

ఎంబీఏ కోర్సులో అందుబాటులో ఉన్న 31,181 సీట్లకు గాను 20,889 సీట్లు భర్తీ కాగా, ఎంసీఏ కోర్సులో 7,281 సీట్లకు గాను 3,099 సీట్లు మాత్రమే నిండాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 14,474 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి.

టీజీ ఐసెట్ చివరి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థు...