భారతదేశం, మార్చి 25 -- రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఐసెట్ - 2026 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఓసారి దరఖాస్తుల గడువు పెంచగా. ఆ గడువు ఈనెల 23వ తేదీతో ముగిసింది. అయితే మరోసారి లేట్ ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకునే ఈ గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

తాజా ప్రకటనలోని వివరాల ప్రకారం.. అర్హులైన అభ్యర్థులు టీజీ ఐసెట్ కు మార్చి 31వ తేదీ వరకు లేట్ ఫీజు లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ విద్యార్థులు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.550 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 2026- 2027 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లు ఇస్తారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా నల్ల‌గొండ‌లోని మహాత్మా గాంధీ యూనివర...