భారతదేశం, మార్చి 6 -- రాష్ట్రంలో యూరియా పంపిణీ కోసం ప్రారంభించిన యాప్‌ లో పలు మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. యాప్ సేవలను సులభతరం చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవల ప్రకారం.. జిల్లాను యూనిట్‌గా తీసుకుని యూరియాను పంపిణీ చేస్తున్నారు. ఈ స్థానంలో మండలాలను యూనిట్ గా తీసుకోవాలని సర్కార్ భావిస్తోంది.

మండలాలను యూనిట్ గా తీసుకోవటంతో ఇబ్బందులు వస్తాయని భావిస్తే. నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. త్వరలోనే ఈ మార్పులు చేసి. యూరియాను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. సాంకేతిక సమస్యలను కూడా పరిష్కరించటం ద్వారా.. యూరియా పంపిణీలో నెలకొంటున్న ఇబ్బందులకు చెక్ పెట్టొచ్చని సర్కార్ భావిస్తోంది.

కొంతకాలంగా రాష్ట్రంలో యూరియా కొరత సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికితోడు ప్రైవేట్ వ్యక్తుల దందాతో లేనికొరతను ...