భారతదేశం, జూన్ 9 -- Telangana Govt Fertilizer App : వ్యవసాయ రంగంలో సాంకేతికతను జోడించి.. ఎరువుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం 'రాష్ట్ర ఫెర్టిలైజర్ యాప్' తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ యాప్ విధానం ద్వారానే రైతులకు ఎరువులను పంపిణీ చేస్తున్నారు.

ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ యాప్ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో ఈ డిజిటల్ వ్యవస్థ దేశానికే దిక్సూచిగా నిలిచిందని చెప్పారు. తెలంగాణ సర్కారు చేపట్టిన ఈ వినూత్న ప్రయోగం ఇతర రాష్ట్రాలను సైతం ఎంతగానో ఆకర్షిస్తోందన్నారు. ఈ ఫెర్టిలైజర్ యాప్ పనితీరును పొరుగు రాష్ట్రాల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారని తెలిపారు.

రైతాంగం నుంచి వచ్చిన ...