భారతదేశం, మే 31 -- TG Employee Health Care Trust : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS)ను పక్కాగా.. పారదర్శకంగా అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది.

ఈ నూతన ఆరోగ్య భద్రత పథకం అమలు తీరు, కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉద్యోగులకు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ సమీక్ష సాగనుంది.

ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోయే 'ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్' ద్వారా నిరంతరాయంగా నిర్వహించనుంది. ఉద్యోగులు, పెన్షనర్ల భాగస్వామ్యంతోనే ఈ ట్రస్ట్ పని చేయనుంది.

ఈ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో ఉద్యోగ సంఘాల నుంచి...