భారతదేశం, మార్చి 18 -- తెలంగాణ యువత కోసం ఉన్నత విద్యామండలి ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఆధునిక సాంకేతికతకు అనుసంధానం చేస్తూ కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. '

యూజీ అండ్ పీజీ కోర్సెస్ న్యూ అండ్ ఎమెర్జింగ్ ఏరియాస్' అనే అంశంపై మంగళవారం టి-సాట్ వేదికగా చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి మాట్లాడారు. ప్రతిపాదించే కొత్త కోర్సులకు సంబంధించిన వివరాలు ప్రకటించారు.

తెలంగాణలోని అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం సుమారు 39 కోర్సులకు రూపకల్పన చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ లో భాగమైన 2047 లక్ష్యాన్ని పూర్తి చేసే ప్రయత్నంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా కొత్త కోర్సులను రూపొందించామన్నారు.

అండర్ గ్రాడ్య...