భారతదేశం, జూలై 31 -- TG EAPCET 2026 Final Phase Counselling : తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. టీజీ ఈఏపీసెట్ (TG EAPCET 2026) చివరి విడత ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ శుక్రవారం(నేటి) నుంచి ప్రారంభమైంది . మొదటి రెండు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో మిగిలి ఉన్న సీట్లను ఈ విడత ద్వారా భర్తీ చేయనున్నారు.

రెండో విడత కౌన్సెలింగ్ ఫలితాల ప్రకారం మొత్తం 80,167 మంది విద్యార్థులకు ఇంజినీరింగ్ సీట్లు దక్కాయి. అయితే. అందులో 71,452 మంది విద్యార్థులు మాత్రమే సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేసి ప్రవేశాలు పొందారు. సీట్లు పొందినప్పటికీ దాదాపు 9,000 మంది విద్యార్థులు వివిధ కారణాల వల్ల కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపలేదు.

ఫలితంగా.. ఆ సీట్లతో పాటు మ...