భారతదేశం, జూన్ 19 -- TG EAPCET 2026 Counselling : ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్ అందించింది. ఎప్‌సెట్ (EAPCET) కౌన్సెలింగ్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.

టీజీఈఏపీసెట్ ప్రవేశాల ప్రక్రియలో భాగంగా విద్యార్థులు ముందుగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు అవకాశం కల్పించారు. స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు జూన్ 22 నుంచి 29 వరకు నిర్దేశించిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు వ్యక్తిగతంగా హాజరుకావాలి.

ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులు.. జూన్ 25 నుంచి జులై 1 వరకు తమకు ఆసక్తి ఉన్న కళాశాలలు, కోర్సులను ఎంచుకుంటూ వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఆప్షన్ల నమోదుపై విద్యార్థులకు అవగాహన క...