భారతదేశం, జూలై 19 -- TG EAPCET 2nd Phase Counselling : బీటెక్ చదవాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ రెండో విడతలో కొత్తగా మరో 4,347 బీటెక్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం వీటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రవేశాల కన్వీనర్ వీటిని కౌన్సెలింగ్‌లో చేర్చారు. కన్వీనర్, యాజమాన్య (మేనేజ్‌మెంట్) కోటాలు రెండూ కలిపితే మొత్తం 6,210 సీట్లు పెరిగినట్లయింది.

తొలివిడత కౌన్సెలింగ్‌ ముగిశాక మిగిలిన 27,487 సీట్లకు ఈ కొత్త సీట్లు కలవటంతో. రెండో విడత కౌన్సెలింగ్‌కు మొత్తం 31,834 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా మరో 10 శాతం (దాదాపు 430) ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్లు కూడా జరగనున్నాయి.

టీజీ ఈఏపీసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ఈనెల 17న ప్రారంభం కాగా.. కొత్తగా 2,622 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలన...