భారతదేశం, మార్చి 25 -- రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 4వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం ఉంది. అయితే ఈసారి కూడా భారీగానే దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.

ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 2026 -2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.ఫైన్ తో అయితే. మే 2 వరకు అవకాశం కల్పించారు. ఇక ఇప్పటికే టీజీ ఈఏపీసెట్ - 2026కు రెండు లక్షలకుపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఇందులోనూ అత్యధికంగా ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష కోసం 1.50 లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. బైపీసీ స్ట్రీమ్ పరీక్షకు 60 వేలు దాటాయి. ఏప్రిల్ 4వ తేదీ(ఫైన్ లేకుండా) నాటికి మరో లక్ష వరకు దరఖాస్తులు రావొచ్చని అధి...