భారతదేశం, ఏప్రిల్ 5 -- రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 4వ తేదీతో గడువు ముసిగింది. ఈ తేదీలోపు భారీగానే దరఖాస్తులు వచ్చాయి.

శనివారం నాటికి 2.90 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. లేట్ ఫీజుతో మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇందులోనూ అత్యధికంగా ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష కోసం 2 లక్షలకుపైగా దరఖాస్తులు దాటాయి. బైపీసీ స్ట్రీమ్ పరీక్షకు 87 వేల వరకు వచ్చాయి. ఇంజినీరింగ్‌ అండ్‌ అగ్రికల్చర్, ఫార్మసీ కోసం (రెండు కలిపి) దాదాపు 300 మంది వరకు దరఖాస్తులు సమర్పించారు. అమ్మాయిల నుంచి అధిక సంఖ్యలో అందాయి.

గతేడాది టీజీ ఈఏపీసెట్ కు మూడు లక్షల దరఖాస్తులు అందాయి. అయితే ఆలస్య రుసు...