భారతదేశం, ఆగస్టు 5 -- TG EAPCET 2026 Final Phase Allotment : ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఈఏపీసెట్ (TG EAPCET) - 2026 కౌన్సెలింగ్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ప్రవేశాల కమిటీ మంగళవారం చివరి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేసింది. ఈ విడతలో కొత్తగా 3,281 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి.

ఈ ఏడాది ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ద్వారా కన్వీనర్ కోటా కింద (ఈడబ్ల్యూఎస్ సీట్లతో కలిపి) మొత్తం 94,156 సీట్లు అందుబాటులో ఉంచారు. అన్ని విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యేసరికి 75 వేలకుపైగా సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 19 వేలకుపైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. అం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తంగా 80 శాతం సీట్లు భర్తీ అయినట్లు లెక్కలు చెప్తున్నాయి.

విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపే కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ 19 ...