భారతదేశం, మార్చి 16 -- హైద‌రాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లాల క్యూర్ (కోర్ అర్భ‌న్ రీజియ‌న్ ఎకాన‌మీ) ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇండ్ల‌ను నిర్మాణానికి అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌ను సిద్దం చేయాల‌ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో నివ‌సించే పేద ప్ర‌జ‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా స్ధ‌లాల‌ను గుర్తించాల‌ని సూచించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని.. దీనికి త‌గ్గ‌ట్టుగా అధికారులు ప‌నిచేయాల‌ని ఆదేశించారు.

సోమ‌వారం స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో స‌హ‌చ‌ర మంత్రులు శ్రీ‌ధ‌ర్ బాబు గారు, అజారుద్దీన్‌ , పొన్నం ప్ర‌భాక‌ర్‌ తో క‌లిసి క్యూర్‌ ఏరియాలో ఇందిర‌మ్మ ఇళ్ల ...