భారతదేశం, జూలై 31 -- TG DOST Special Phase Allotment 2026 : దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ కు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. అర్హులైన అభ్యర్థులకు సీట్లను కేటాయించారు. ఈ విడతలో మొత్తం 53,967 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి.

ఈ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో సీటు దక్కించుకున్న విద్యార్థులందరూ ఆగస్టు 01, 2026 వరకు ఆన్‌లైన్ పద్ధతిలో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (TC)తో పాటు ఇతర అవసరమైన ధృవీకరణ పత్రాలను కేటాయించిన కళాశాలలో సమర్పించాలి. ఈ నిర్దేశిత గడువులోగా కళాశాలలో రిపోర్ట్ చేయని అభ్యర్థుల సీటు కేటాయింపు రద్దవుతుంది. అందువల్ల అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే తమ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ స్పెషల్ ఫేజ్‌‌‌‌లో కేటాయించిన సీట్లలో బీకామ్‌‌‌‌ల...