భారతదేశం, మే 24 -- TG DOST Phase 2 Registrations : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మొదటి విడతలో సీటు రాని విద్యార్థులు. అలాగే ఇప్పటివరకు అసలు దరఖాస్తు చేసుకోని కొత్త అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. అర్హులైన విద్యార్థులు రేపటిలోపు (మే 25) ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

సమయం తక్కువగా ఉన్నందున అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా కాలేజీల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్లు కూడా ఎంచుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

దోస్త్ రెండో విడత కౌన్సెలింగ్‌లో ప...