భారతదేశం, మే 14 -- Telangana DOST Seat Allotment 2026 : ఇంటర్మీడియట్ పూర్తి చేసి, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఇవాళ దోస్త్ మొదటి విడత సీట్లను కేటాయించనున్నారు. రాష్ట్రంలోని ఆరు యూనివర్సిటీల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం వేల సంఖ్యలో విద్యార్థులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు.

సీటు పొందిన విద్యార్థులు తమ వివరాలను తెలుసుకోవడానికి దోస్త్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

సీటు పొందిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా 'సెల్ఫ్ రిపోర్టింగ్' ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఉన్నత విద్యామండలి తేదీలను ఖరారు చేసింది. ఈ ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థులు.మే 15 నుండి మే 23 వరకు ఆన్‌లైన్ సెల్ఫ్-రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సీటు పొందిన విద్యార్...