భారతదేశం, జూలై 27 -- TG DOST 2026 Special Phase Counseling : ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఎదురుచూస్తున్న విద్యార్థులకు మరో అప్డేట్ వచ్చేసింది. 'దోస్త్' ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఇవాళ్టితో (జూలై 27, 2026) ముగియనుంది. డిగ్రీ ప్రవేశాలు కోరుకునే అభ్యర్థులు వెంటనే తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంపిక చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

ఇప్పటివరకు ఏ విడతలోనూ సీటు పొందని వారు, కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రాసెస్ పూర్తి చేయడానికి జూలై 27, 2026 వరకు మాత్రమే అవకాశం కల్పించారు.

వికలాంగులు (PH), సైనిక ఉద్యోగుల పిల్లలు, ఎన్సీసీ (NCC), స్పోర్ట్స్, ఇతర పాఠ్యేతర కార్యకలాపాలకోటా ఉన్న అభ్యర్థులకు సంబంధించి ఇవాళ యూనివర్సిటీ హెల్ప్‌లైన్ కేంద్రాలలో ధృవీకరణ...