TG Doctors Strike : తెలంగాణలో డాక్టర్ల సమ్మెబాట - నేటి నుంచి ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్
భారతదేశం, జూన్ 5 -- Telangana Doctors Strike : రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల బదిలీల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వైద్యుల బదిలీల ప్రక్రియలో ప్రభుత్వం నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతోందని ఆరోపిస్తూ తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (TGDA) ఆగ్రహం వ్యక్తం చేసింది. బదిలీల్లో పారదర్శకత పాటించాలనే డిమాండ్తో ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం. 38 ప్రకారం బదిలీలు నిర్వహించకుండా అధికారులు ఏకపక్షంగా సీట్లు కేటాయిస్తున్నారని వైద్యులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల వందలాది మంది వైద్యులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేందుకు వీలు కల్పించే స్పౌజ్ కేటగిరీ దరఖాస్తులను అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. తీవ్ర అనారోగ్య స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.