భారతదేశం, ఆగస్టు 26 -- Telangana Cheyutha Pension Scheme : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'చేయూత' పింఛను పథకం కింద కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా వచ్చే నెల సెప్టెంబరు 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించబోతున్నట్లు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ ప్రాపర్టీ (SERP - సెర్ప్) స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల యంత్రాంగానికి, అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.

కొత్త పింఛన్ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 9వ తేదీన ప్రారంభమైంది. దరఖాస్తుల సమర్పణకు ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు అందుబాటులో ఉంది. ఇప్పటివరకు నమోదు అయిన సమాచారం ప్రకారం.. మంగళవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 3,03,066 మంది అర్హులైన పేదలు పింఛన్ కోసం అర్జీలు సమర్పించారు. ద...