భారతదేశం, ఆగస్టు 29 -- Telangana Cheyutha Pension Scheme : నిరుపేదలకు, ఆసరా అవసరమైన వారికి నూతన ఊరటనిచ్చే 'చేయూత' పింఛను పథకానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ప్రభుత్వం కేటాయించిన నిర్ణీత గడువు దగ్గరపడుతుండటంతో అర్హులైన లబ్ధిదారులు త్వరపడాలని అధికారులు స్పష్టం చేశారు.

ఈనెల (ఆగస్టు) 31వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ పథకం కింద నూతన పింఛన్ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆగస్టు 9వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. అర్హత ఉండి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు వెంటనే స్పందించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

అర్హులైన లబ్ధిదారులు చేయూత అధికారిక వెబ్‌సైట్ ( cheyutha.telangana.gov.in ) నుంచి దరఖాస్తు ఫారమ్‌ను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకున్న ఫారమ...