భారతదేశం, జూలై 31 -- రాష్ట్రంలోని త‌ల‌సేమియా, సికిల్‌సెల్ అనీమియా బాధితులంద‌రికీ పింఛ‌న్లు మంజూరు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులను గుర్తించి ఈ ప్ర‌క్రియ‌ను వెంట‌నే ప్రారంభించాల‌ని చెప్పారు. ఆగ‌స్టు 15వ తేదీ నుంచి పింఛ‌న్లు పంపిణీ చేయాల‌ని ఆదేశించారు. బాధిత కుటుంబాల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించేందుకు పింఛ‌న్లు దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని అన్నారు.

పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల‌పై మంత్రి సీతక్కతో క‌లిసి ముఖ్య‌మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. రాష్ట్రంలోని వితంతు, ఒంట‌రి మ‌హిళ‌లు, నేత‌, గీత కార్మికులంద‌రికీ సంతృప్తిక‌ర స్థాయిలో పింఛ‌న్లు (పెన్షన్లు) మంజూరు చేయాల‌ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. దివ్యాంగులు చనిపోయిన‌ప్పుడు వారి భార్య‌ల‌కు త‌క్ష‌ణ‌మే పింఛ‌న్లు ఇవ్వాల‌న్నారు. ఈ విష‌యంలో ఎటువంటి జాప్యానికి తావివ్వద్ద‌న్నారు.

మండ...