భారతదేశం, మే 23 -- Telangana Cabinet Decisions 2026 : రాష్ట్రంలో రెండో విడ‌త ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 2 ల‌క్ష‌ల 50 వేల మంది పేద కుటుంబాల ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది.

ఉమ్మ‌డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి గోడ‌లు, శ్లాబు ద‌శ‌లో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పునాదులు పూర్త‌యి గోడ‌లు, శ్లాబు ప‌డ‌ని ఇళ్ల‌కు రూ.3 ల‌క్ష‌లు, గోడ‌లు పూర్త‌యి శ్లాబు నిలిచిపోయిన ఇళ్ల‌కు రూ.2 ల‌క్ష‌లు చొప్పున అందించనుంది. అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసేందుకు నియోజ‌క‌వ‌ర్గానికి 500 ఇళ్ల‌కు చొప్పున నిధులు కేటాయిస్తూ క...