భారతదేశం, మార్చి 28 -- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే హరీశ్ రావ్ మాట్లాడుతూ. విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించారు.కాంగ్రెస్ సర్కార్‌కు ధైర్యం ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి లేదా హౌస్ కమిటీ వేయాలని సవాల్ విసిరారు.

ఎలాంటి పర్మిషన్లు, లైసెన్సులు లేకుండా డీజిల్ జనరేటర్లతో దర్జాగా స్టోన్ క్రషర్ దందా చేస్తున్నారని హరీశ్ రావ్ ఆరోపించారు. అధికారులు రెండుసార్లు పట్టుకున్నా, నోటీసులు ఇచ్చినా రాఘవ కన్స్ట్రక్షన్స్‌పై యాక్షన్ ఏదీ.? అని ప్రశ్నించారు.

"నిబంధనల ప్రకారం 25 వేల జరిమానా, ఏడాది జైలు శిక్ష ఎందుకు వేయలేదు..? బీఆర్ఎస్ ఎమ్మెల్యే తమ్ముడికి రాత్రికి రాత్రే జైలు.. అధికార పార్టీ మంత్రికి మాత్రం అండదండలా..?రాఘవ కన్స్ట్రక్ష...