భారతదేశం, జూన్ 18 -- భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్న వేళ, గ్లోబల్ ఈవీ దిగ్గజం 'టెస్లా'.. దేశంలో తన నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ రాజధాని, ప్రముఖ ఐటీ హబ్ అయిన హైదరాబాద్‌లో టెస్లా ఇండియా తన సరికొత్త 'ఎక్స్‌పీరియన్స్ సెంటర్'ని గ్రాండ్‌గా ప్రారంభించింది. మాదాపూర్ హైటెక్ సిటీలోని నాలెడ్జ్ సిటీలో ఈ సరికొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది భారతదేశంలో టెస్లాకు చెందిన ఐదో ఎక్స్‌పీరియన్స్ సెంటర్ కావడం విశేషం. జూన్ 17, 2026 నుంచి ఈ సెంటర్ అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ షోరూమ్‌లో కంపెనీ తన లేటెస్ట్ మోడళ్లు అయిన 2026 మోడల్ వై ప్రీమియం రియర్-వీల్ డ్రైవ్ (ఆర్​డబ్ల్యూడీ), మోడల్ వై ఎల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ప్రదర్శనకు ఉంచింది.

హైదరాబాద్‌లో కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించడం...