భారతదేశం, జూలై 9 -- Telugu Web Series: తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ సాధారణంగా ఏదైనా ఒక ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం సాధరణమే. అయితే ఇప్పటికే ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న 'గుర్తుకొస్తున్నాయి' అనే సిరీస్ మాత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోకి కూడా రాబోతోంది. రేపటి నుంచి అంటే జులై 10 నుంచి ఈ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆ ఓటీటీ వెల్లడించింది.

ఈటీవీ విన్ ఓటీటీలో గత వారం రిలీజైన వెబ్ సిరీస్ ఈ 'గుర్తుకొస్తున్నాయి'. ఓటీటీలోకి అడుగుపెట్టిన రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ తో దూసుకెళ్లింది. ఇప్పటికీ యువత మనసు కొల్లగొడుతూ ఆ ఓటీటీలో రికార్డలు తిరగరాస్తోంది.

అయితే ఈ మధ్యే ఈటీవీ విన్ కంటెంట్ ను తన ప్లాట్‌ఫామ్ పై కూడా స్ట్రీమింగ్ చేస్తున్న నెట్‌ఫ్లిక్స్ ఈ 'గుర్తుకొస్తున్నాయి' సిరీస్ ను కూడా స్ట్రీమింగ్...