భారతదేశం, జూలై 15 -- తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కదలికలు మందగించడంతో రాగల వారంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీనివల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రం కానున్నాయి. ముఖ్యంగా హన్మకొండ జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సాధారణంగా జూలై మాసంలో 20 శాతం వరకు వర్షపాతం లోటు ఉంటే దానిని సాధారణంగానే పరిగణిస్తారు. కానీ ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో ఏకంగా 65 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ పరిమితి కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడినప్పటికీ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల తెలంగాణకు దాని ప్రభావం పెద్దగా ఉండదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా జులై 22 వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం చ...